gulam nabi ajad pi garamగులాంపై గరం - ఆ‘జాదు’పై మండిపడ్డ తెలంగాణ - స్వచ్ఛందంగా బంద్ పాటించిన విద్యాసంస్థలు - బస్టాండ్ల ఎదుట ఆర్టీసీ కార్మికుల ధర్నా - విధులు బహిష్కరించిన న్యాయవాదులు - సోనియా, ఆజాద్‌ల దిష్టిబొమ్మల దహనం


గులాంపై గరం
trss- ఆ‘జాదు’పై మండిపడ్డ తెలంగాణ
- స్వచ్ఛందంగా బంద్ పాటించిన విద్యాసంస్థలు
- బస్టాండ్ల ఎదుట ఆర్టీసీ కార్మికుల ధర్నా
- విధులు బహిష్కరించిన న్యాయవాదులు
- సోనియా, ఆజాద్‌ల దిష్టిబొమ్మల దహనం

టీ మీడియా, నెట్‌వర్క్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌పై తెలంగాణవాదులు గరమయ్యారు. ఈ నెల 28 లోగా తెలంగాణ ప్రకటన వస్తుందని ఆశిస్తున్న తరుణంలో ‘నెలంటే నెల రోజుల్లోనే తెలంగాణపై తేల్చలేమని, సమస్య పరిష్కారానికి డెడ్‌లైన్ అంటూ ఏదీ లేదని, షిండే చెప్పినంత మాత్రనా నెలలో తేల్చలేమని, వరుసగా సెలవులు ఉన్నందున సమయం పడుతుంది’ అని ఆజాద్ వ్యాఖ్యానించడంపై ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తెలంగాణవ్యాప్తం గా ఓయూ విద్యార్థి జేఏసీ పిలుపు మేరకు విద్యాసంస్థల బంద్ పాటించారు. బస్టాండ్ల ఎదుట ఆర్టీసీ కార్మికులు ధర్నా చేయగా, న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. సోనియా, ఆజాద్ దిష్టిబొమ్మలను ఊరేగించి దహనం చేశారు. సీమాంధ్ర నేతల డబ్బు సంచులకు అమ్ముడుపోయిన ఆజాద్ తెలంగాణపై ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ మోసాలను ఇక్క సహించేది లేదని, ఇకనైనా తెలంగాణ కాంగ్రెస్ ప్రజావూపతినిధులు పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో కలిసిరావాలని, లేకుంటే వారికి రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. ఎప్పటికైనా తెలంగాణ వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో హన్మకొండలోని కార్యాలయంపై ఉన్న పార్టీ జెండాలను తొలగించగా పోలీసులు వారిని అరెస్టుచేశారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో విద్యార్థులు ఇంటర్ ప్రీఫైనల్ ప్రశ్నపవూతాలను చింపివేసి పరీక్షలను బహిష్కరించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిర్పూర్‌లో న్యాయవాదులు విధులను బహిష్కరించి సోనియా, ఆజాద్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నిజామాబాద్‌లో జేఏసీ ఆధ్వర్యంలో మంత్రి సుదర్శన్‌డ్డి ఇంటి ముట్టడికి విఫలయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు ఉద్యమకారుల మధ్య తోపులాట జరిగింది. చివరకు ఉద్యమకారులు ఆజాద్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఆజాద్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన
ఆవుడం(ఆదిలాబాద్): ఆజాద్ వ్యాఖ్యలపై కాం గ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అర్కాల హేమల త ఆధ్వర్యంలో ఆవుడంలో ర్యాలీ, ఆజాద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం హేమలత మాట్లాడుతూ కాంగ్రెస్ నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 28 లోగా తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయకుంటే మండలంలో మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని, కాంగ్రెస్ జెండాలు తీసేసి, పార్టీ గద్దెలు కూలగొడుతామని హెచ్చరించారు. సీమాంధ్ర నేతలకు తొత్తులుగా మారిన తెలంగాణ నాయకులు ఇకనైనా మేల్కొ ని ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించాలని హితవు పలికారు.

Comments

Popular Posts